Monday, April 29, 2024

గత ప్రభుత్వాలు కంటోన్మెంట్ ను పట్టించుకోలేదు: తలసాని

- Advertisement -
- Advertisement -

KCR Govt concentrate on Cantonment

 

హైదరాబాద్: పేదోళ్లపై ఒక్క రూపాయి భారం పడకుండా ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో 264 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు.  ఒక్కో ఇంటికి రూ. 7 లక్షల చొప్పున ఖర్చు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. గత ప్రభుత్వాలు కంటోన్మెంట్ ను పట్టించుకోలేదని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎంఎల్ఎ సాయన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News