Thursday, May 2, 2024

ఇది అన్నదాతల విజయం: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ‌ పోరాటానికి కేంద్ర దిగిరాక త‌ప్ప‌లేద‌న్నారు. రైతుల‌కు మ‌ద్ధ‌తుగా… వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేఖంగా సిఎం కెసిఆర్ చేప‌ట్టిన ఉద్య‌మ‌ సెగ ఢిల్లీకి త‌గిలింద‌ని తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్న‌దాత‌లకు అండ‌గా ఉంటుంద‌ని, వారి కోసం నిరంత‌ర పోరాటం కొన‌సాగిస్తుంద‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిర్విరామంగా పోరాటం చేసి విజయం సాధించామని, అన్నదాతలకు ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News