Thursday, May 2, 2024

భార్యపై అనుమానం… రెండు నెలల చిన్నారిని చెరువులో పడేసి

- Advertisement -
- Advertisement -

 

newborn baby dies due to doctor negligence in Nallakunta

అమరావతి: భార్యపై అనుమానంతో రెండు నెలల చిన్నారిని కన్నతండ్రి పొట్టన పెట్టుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లిఖార్జున-చిట్టెమ్మ దంపతులకు ఓ పాప జన్మించింది. పాప అనారోగ్యంతో ఉండడంతో కళ్యాణ దుర్గంలో ఆర్‌డిటి ఆస్పత్రి తీసుకొచ్చారు. పాప బిగబట్టి ఏడుస్తుండడంతో మల్లిఖార్జున బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లిన భర్త కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో చిట్టెమ్మ ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కేంద్రంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. భార్యపై అనుమానంతో రెండు నెలల కూతురు నోటికి ప్లాస్టర్ వేసి గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేశానని చెప్పాడు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News