Tuesday, May 7, 2024

క్షేత్రస్థాయిలో సమావేశాలు

- Advertisement -
- Advertisement -

agricultural

 

త్వరలో జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో నేరుగా సమావేశం
ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు
మంచి ధరలు వచ్చి రైతులకు మేలు కలిగేలా చర్యలు
వ్యవసాయ నిపుణులు, అధికారులతో సమీక్ష అనంతరం సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అమలు చేయబోయే సమగ్ర వ్యవసాయ విధానంపై క్షేత్ర స్థాయి వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయి ంచారు.

రాష్ట్రంలో పంటలకు మం చి ధర వచ్చి, రైతులకు మేలు కలిగేలా చేయాలని ముఖ్యమంత్రి భా విస్తున్నారు. అందరూ ఒకే పం ట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నా య పంటలు వేసే పద్ధతిని అమలు చే యాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు నిపుణులు, శాస్త్రవేత్తలతో అనేక మార్లు సిఎం చర్చించారు. రాష్ట్రం లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి..? పండిన పంటను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి..? అనే విషయాలపై అధ్యయనం జరిగింది. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా వ్యవసాయాధికారులు, మండల వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయించారు. త్వరలోనే ఈ సమావేశం ఏర్పాటు కానుంది. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని మండలాలకు చెందిన వ్యవసాయ విస్తరణాధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో సిఎం మాట్లాడతారు.

రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధికి అనేక చర్యలు : సిఎం

తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నదని, ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అద్భుత తెలంగాణ రూపొందుతున్నదని అన్నారు. వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితి, వ్యవసాయ యూనివర్సిటీ, పౌర సరఫరాల సంస్థ సమన్వయంతో వ్యవహరించి, రైతులకు మేలు చేసే వ్యవసాయ విధానాన్ని అమలు చేసే చైతన్యం కలిగించాలని సిఎం కెసిఆర్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో దాదాపు 90 లక్షల ఎకరాల్లో ప్రతీ ఏటా వరి పంట పండుతుందని, రెండు కోట్ల 70 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని తెలిపారు.

ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి అనుగుణంగా రాష్ట్రంలో రైస్ మిల్లులు తమ సామర్థ్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సూచించారు. రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడమే కాకుండా, ఆ ముడి సరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా తీసుకునే క్రియాశీల సంస్థగా పౌర సరఫరాల సంస్థ రూపాంతరం చెందాలని వ్యాఖ్యానించారు. దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుందని తెలిపారు వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయని, కల్తీలను అరికట్టవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News