Sunday, April 28, 2024

కారు ప్రమాదంలో ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Five members dead in Road accident in UP

లక్నో: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ ప్రాంతం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. చౌరాసి శివారులో ఓ కారు అదుపుతప్పి రెండు బైక్ లు, సైకిలిస్టును ఢీకొట్టడంతో ఐదుగురు ఘటనా స్థలంలో చనిపోయారు. అనంతరం ఎస్ యువి కారు చెట్టును ఢీకొట్టిన తరువాత దబౌలి గ్రామంలో ఓ గుంతలో పడిపోయింది. డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఎస్సీ ఆనంద్ కులకర్ణి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. మృతులు రాకేష్(35), రాజారామ్(65), రితిక్ (05) గా గుర్తించారు. వీరు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో ఇద్దరు సౌరబ్(28), ఆశిష్(25) గా గుర్తించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మరో 50 వేల ఆర్థిక సాయం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News