Saturday, May 18, 2024

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జబల్‌పూర్-నాగ్‌పూర్ జాతీయ రహదారి-44లో ఆలోనియా టోల్ ప్లాజా వద్ద కారు అతి వేగంగా వచ్చి వెనుక నుంచి ఆగి ఉన్న ట్యాంకర్ ను ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలలు ఉన్నారు. మృతులంగా ఒకే కుటుంబానికి చెందిన కర్నాటక వాసులుగా గుర్తించారు. ఉత్తర ప్రదేశ్‌లోని బెనారస్ నుంచి కర్నాటకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు విజయ్ బహదూర్ పటేల్, సరితా, అజయ్ కుమార్, రాధా పటేల్, మరో మహిళ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బుందోల్ పోలీస్ అధికారి దిలీప్ పంచేశ్వర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News