Sunday, May 5, 2024

టిఎస్‌పిఐసిసిసిలో విదేశీయులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఐసిసిసిని విదేశీ ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. 25 దేశాలకు చెందిన 37మంది ప్రతినిధులు టూరింగ్ ద కంట్రీలో భాగంగా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఆన్ ఆడిట్ ఆఫ్ ఈ గవర్నెన్స్‌లో టిఎస్‌పిఐసిసిపిలోని పలు విభాగలను పరిశీలించి పనిచేసే తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పి పుష్ప వారికి వార్ రూమ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటి ఎంప్లాయిస్, అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. సిసిటివిలు, ట్రాఫిక్ సెన్సార్లు, మాస్ గ్యాదరింగ్స్, జియో ఫెన్స్ అలర్ట్, అన్‌అటెండెడ్ బ్యాగేజీ,ట్రాఫిక్ జాం తదితరాల పనితీరును తెలుసుకున్నారు. తర్వాత ప్రతినిధులు మ్యూజియం, హెలీపాడ్, ఆడిటోరియం, బిల్డింగ్ తదితరాలను పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News