Tuesday, May 21, 2024

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్‌కు పాజిటివ్

- Advertisement -
- Advertisement -

former up cm akhilesh yadav tests positive for covid-19

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఉత్తర్ ప్రదేశ్ మంత్రి అషుతోష్ టాండన్‌కు కరోనా వైరస్ సోకింది. తాను పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా రిపోర్టులు వచ్చాయని, తాను ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉండి ఇంట్లోనే చికిత్స పొందుతున్నానని అఖిలేష్ యాదవ్ బుధవారం ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులుగా తనను కలుసుకున్న వారు పరీక్షలు చేయించుకోవాలని, కొద్ది రోజులు వారు స్వీయ నిర్బంధంల ఉండాలని అఖిలేష్ సూచించారు. ఇటీవల హరిద్వార్‌ను సందర్శించిన అఖిలేష్ కుంభమేళాలో పాల్గొన్నారు. వివిధ మత పెద్దలను కలుసుకున్నారు. ఇదివరకే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన అఖారా పరిషద్ చైర్మన్ మహంత్ నరేంద్ర గిరిని కూడా ఆయన కలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News