Monday, May 20, 2024

మహారాష్ట్రలో నలుగురు చిన్నారుల హత్య

- Advertisement -
- Advertisement -

Four children killed in Maharashtra

 

ముంబయి: మహారాష్ట్రలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారుల్ని గుర్తుతెలియని వ్యక్తి హత్యగావించిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. జలగాం జిల్లా రేవర్ తాలూకా బోర్కేడాశివారు గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. చనిపోయిన చిన్నారులు సంగీత(13), రాహుల్(11), అనిల్(8), నానీ(6)గా గుర్తించారు. తల్లిదండ్రులు తమ పెద్ద కుమారుడితో కలిసి మధ్యప్రదేశ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఫార్మ్‌హౌస్‌లోని నీటి గుంటలో నలుగురి శవాలు పడి ఉండగా, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. గొడ్డలితో చిన్నారుల మెడపై నరికి చంపినట్టుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News