- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో 1995 ఐపిఎస్ బ్యాచ్కు చెందిన ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్, వి.వి.శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్లకు అదనపు డిజిలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఐజిలుగా విధులు నిర్వహిస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, వి.వి.శ్రీనివాసరావు, స్వాతి లక్రా, మహేష్ భగవత్లకు అదనపు డిజిలుగా పదోన్నతి లభించింది. కాగా పదోన్నతి పొందిన అధికారులు అదనపు డిజి హోదాలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న స్థానంలో యథావిధి స్థానాల్లో కొనసాగాలని ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -