Thursday, May 2, 2024

కల్వర్టును ఢీకొన్న కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four Members dead in Car collided culvert

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. గుంటూరు జిల్లా తంబాళగరువు గ్రామానికి చెందిన కృష్ణ(55), పాండురంగారావు(56), మధుకర్(58), సురేష్(50) అనే స్నేహితులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లారు. దేవుడిని దర్శించుకున్న అనంతరం సొంతూరుకు వస్తుండగా త్రిపురాంతంకం ప్రాంతంలో వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలో ముగ్గురు చనిపోగా చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించామని సిఐ దేవ ప్రభాకర్, ఎస్‌ఐ కృష్ణయ్య పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News