Friday, May 3, 2024

ప్రతిపక్షాలు బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారు: పల్లా

- Advertisement -
- Advertisement -

Opposition Parties criticize to KCR Govt

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎంఎల్ సి ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లా మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వంద శాతం న్యాయం జరుగుతోందన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో లెక్కలతో సహా వివరణ ఇచ్చామని అయినా ప్రతిపక్షాలు బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని పల్లా ఎద్దేవా చేశారు. త్వరలో 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, ఈ సారి కూడా తనకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News