Saturday, April 27, 2024

వివాహేతర సంబంధం… ప్రియుడు, ప్రియురాలు హత్య

- Advertisement -
- Advertisement -

Husband murder wife-lover in Tamilnadu

 

చెన్నై: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను, ఆమె ప్రియుడిని హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం శివగంగై, ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రామనాథపురం జిల్లా మనిచ్చియేందల్ ప్రాంతంలో సత్యేంద్రన్(26), వలర్మతి(24) అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంతపులు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యేంద్రన్ ఓ దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పక్కింట్లో ఉండే యువకుడు వేల్ రాజ్‌తో వలర్మతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారం రోజుల క్రితం వేల్‌రాజ్‌తో వలర్మతి లేచిపోయింది. తిరుచ్చిలోని ధారానల్లూరు ప్రాంతంలో వారు సహజీవనం సాగిస్తున్నారని తెలుసుకున్న సత్యేంద్రన్ తన తమ్ముడు ప్రభు, స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. వేల్‌రాజ్, వలర్మతిపై దాడి చేయడంతో వారు ఘటనా స్థలంలోనే చనిపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సత్యేంద్రన్ చనిపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News