Saturday, May 4, 2024

ప్రేమపెళ్లి…. కూతురు నోట్లో పురుగుల మందు పోసి….

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకుందని కూతురిపై కుటుంబ సభ్యులు నోట్లో పురుగుల మందు పోసి హత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సీతారమాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సింగారెడ్డి పల్లె గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే యువకుడు, దేవమ్మ చెరువు చెందిన అనిత అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మార్చి 5న ప్రేమ జంట పెళ్లి చేసుకోవడంతో యువతి కుటుంబ సభ్యులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తెను కిడ్నాప్ చేశారని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

ఇద్దరు మేజర్లమని , ప్రేమించి పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలియజేయడంతో ఎంఆర్‌ఒ వెంకట సునీల్ దగ్గరు ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రేమజంట సింగారెడ్డి పల్లె గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో వారిని వెంబడించి వారిపై దాడి చేశారు. యువతి నోట్లో పురుగుల మందు పోసి హత్య చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దంపతులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రభాకర్ రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News