Saturday, April 27, 2024

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్: జగన్

- Advertisement -
- Advertisement -

వెలిగొండ ప్రాజెక్టుకు తన తండ్రి వైఎస్సార్ శంకుస్థాపన చేస్తే, ఆయన కొడుకుగా తాను ఈ ప్రాజెక్టును పూర్తి చేశాననీ, ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ఆయన బుధవారం  జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల 15 లక్షలమంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4.47లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.

ప్రాజెక్టు టన్నెల్లో ప్రయాణం చేస్తూ ఎంతో సంతోషించానన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో ఉన్న రెండు టన్నెళ్ల పనులు వైఎస్సార్ హయాంలో చకచకా సాగగా చంద్రబాబు హయాంలో నత్తనడక నడిచాయని జగన్ విమర్శించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News