Friday, May 3, 2024

మరి 4

- Advertisement -
- Advertisement -

Four new Omicron cases in Telangana

రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు, ఏడుకు చేరిన కేసుల సంఖ్య

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 6,764 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా, గురువారం 120 మంది వచ్చారు. వారిలో 21 మందికి ఆర్‌టిపిసిఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.

వీరి నమూనాలను సేకరించి అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. వాటిలో ఇప్పటికే 17 మందికి ఒమిక్రాన్ నెగెటివ్ తేలగా, ఏడుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురి పలితాలు రావాల్సి ఉంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 40,103 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా .. కొత్తగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సుఖ్య 6,78,064కి చేరింది. కరోనాతో ఇద్దరు మృతి చెందగా, మృతుల సంఖ్య 4022కి చేరింది. తాజాగా కరోనా నుంచి 195 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,805 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News