Friday, May 3, 2024

9,800 కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అక్టోబర్‌లో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.9,800 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అమెరికా బాండ్ రాబడిలో పెరుగుదల, ఇజ్రాయెల్‌హమాస్ యుద్ధం కారణంగా అనిశ్చితి వాతావరణం కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.

సెప్టెంబర్ నెలలో ఎఫ్‌పిఐలు నికర విక్రేతలుగా ఉండగా, దాదాపు రూ.14,767 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ పె ట్టుబడుల ఉపసంహరణకు ముందు ఆరు నెలలుగా విదేశీ ఇన్వెస్టర్లు వరుస గా భారతీయ ఈక్విటీ మార్కెట్లలో కొ నుగోళ్లు జరుపగా, దాదాపు రూ.1.74 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News