Tuesday, April 30, 2024

ఫన్, యాక్షన్‌తో ఫ్యామిలీ డ్రామా

- Advertisement -
- Advertisement -

అక్కడొకడున్నాడు, రాఘవరెడ్డి చిత్రాలనంతరం లైట్ హౌస్ సినీ మ్యాజిక్ ప్రొడక్షన్ నంబర్- 3తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నారు ప్రముఖ దర్శకులు సుబ్బారావు గోసంగి. భోజ్ పురిలో అగ్ర దర్శకుడిగా అలరారుతున్న సుబ్బారావు గోసంగి దర్శకత్వంలో కె.శివశంకర్ రావుల, వెంకటేశ్వర రావు-, రాంబాబు యాదవ్-, శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ కంఠంనేని, పక్కి హెగ్డే, సూర్య-ప్రీతి శుక్లా హీరోహీరోయిన్లు. ఘంటా శ్రీనివాసరావు సమర్పిస్తున్న ఈ చిత్రానికి కొల్లిపర శ్రీనివాస్ సహ నిర్మాత.

ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం హైదరాబాద్ శివారులో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు సుబ్బారావు గోసంగి, నిర్మాత రావుల వెంకటేశ్వరరావు, చిత్ర సమర్పకులు ఘంటా శ్రీనివాసరావు, హీరోలు శివ కంఠంనేని, శ్రీసూర్య, హీరోయిన్లు పక్ఖి హెగ్డే, ప్రీతి శుక్లా, సహ నిర్మాత కొల్లిపర శ్రీనివాస్, ఛాయాగ్రాహకుడు డి.ప్రకాష్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సుబ్బారావు గోసంగి మాట్లాడుతూ “చాలా గ్యాప్ తర్వాత లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై నిర్మాణమవుతున్న చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాము”అని అన్నారు. నిర్మాత రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఫన్-, యాక్షన్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా మా దర్శకులు సుబ్బారావు గోసంగి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News