Thursday, May 2, 2024

బల్దియా పీఠంపై గులాబీ జెండా

- Advertisement -
- Advertisement -

Gadwal vijaya laxmi elected as GHMC Mayor

 

హైదరాబాద్: బల్దియా పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. జిహెచ్ఎంసి పీఠాన్ని టిఆర్ఎస్ దక్కించుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి ఎన్నుకున్నారు. డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత రెడ్డిని ఎన్నుకున్నారు. చేతులెత్తే పద్దతిలో మేయర్, డిప్యూటీ మేయర్ ను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కొత్త కార్పొరేటర్లకు సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, పలువురు మంత్రులు, ఎంఎల్ఎ, ఎంఎల్సీలు అభినందనలు తెలిపి శుభాశీస్సులు అందించారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ గా విజయ లక్ష్మిగా గెలుపొందారు. 2016లో కూడా కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.  హోలీ మేరీ స్కూల్ లో ప్రైమరీ విద్యను పూర్తి చేయగా రెడ్డీ వుమెన్స్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. భారతీయ విద్యాభవన్ లో జర్నలిజం, సుల్తాన్ ఉల్ లుమ్ లా కాలేజీలో  ఎల్ఎల్ బి పూర్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News