Monday, May 6, 2024

ప్రేమజంట ఆత్మహత్య…

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమూక ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  ఉండవల్లి గ్రామ సమీపంలోని ఆనంతపద్మనాభస్వామి ఆలయం వెనుక భాగంలో ప్రేమజంట అపస్మారక స్థితిలో ఉండడంతో వారిని 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. యువకుడు ఘటనా స్థలంలో చనిపోగా యువతి బతికే ఉండడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువతి చనిపోయింది. ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు మండలం ముప్పాళ్లపాడు గ్రామానికి చెందిన పృథ్వీ (25), హైదరాబాద్ కు చెందిన ఫరాని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. పృథ్వీ హైదరాబాద్ లోని పండ్ల దుకాణంలో పని చేసేవాడు. పండ్ల దుకాణం యజమాని కూతురు ఫరానాతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకోవడంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన యువతిని గుంటూరు తీసుకొచ్చాడు. శీతలపానియంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఎస్ఐ నారాయణ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News