Thursday, May 2, 2024

సహాయ నిరాకరణోద్యమం

- Advertisement -
- Advertisement -

గాంధీయుగం:

US congress to award congressional gold medal to gandhi

భారత రాజకీయాలలో గాంధీయుగం ఆవిర్భావానికి అతడి అమోఘమైన వ్యక్తిత్వం అపారమైన మేధస్సు, వాస్తవ పరిస్థితులు తొడ్పడ్డాయి.
పరిస్థితులకు తగిన విధంగా మారే వ్యక్తిత్వం గాంధీకి అనుకూలించింది.
జనరల్ కంపార్ట్ మెంట్‌లో ప్రయాణిస్తూ సామాన్య ప్రజలలో ఒకడిగా మెలిగాడు.
ప్రజల నాడిని అంచనా వేయడంలో పరిణితి చెందాడు.
వ్యతిరేకంగా సమాజంలోని అన్ని వర్గాలను కలుపు కొని ఉద్యమాన్ని నిర్వహించిన అనుభవమున్న ఒకే ఒక నాయకుడు గాంధీజీనే..
గాంధీజీ తన తొలి ఉద్యమాన్ని చంపారన్, కేథ్, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమాలు నడిపాడు.
శ్రామిక వర్గాలకు సంరక్షకునిగా పిలవబడిన గాంధీజీ హింసను వ్యతిరేకించటం వలన భూస్వామ్య, పెట్టుబడిదారి వర్గాలకు నాయకుడయ్యాడు.
రామరాజ్యం ప్రస్థావించుట వలన సనాతన హిందువలు దృష్టిని ఆకర్షించిన గాంధీ ఖిలాఫత్ సమస్యను ప్రస్తావించి ముస్లింలకు నాయకునిగా గుర్తిచబడ్డాడు.
వైవిధ్య భావాల మధ్య సమతుల్యాన్ని పాటించే గాంధీజి వ్యక్తిత్వం కాంగ్రెస్‌లో ఇతడి ఆధిపత్యానికి దారితీసింది.
మాటలలో మితవాది గాను, చేతలలో అతివాదిగానూ గాంధీ కాంగ్రెస్‌లోని ఇరు వర్గాలకు నాయకుడయ్యాడు.
గాంధీయుగంలో మొట్ట మొదటి, జాతీయోద్యమంలో రెండవ పోరాటమైన సహాయ నిరాకరణోద్యమానికి కారణాలు మొదటి ప్రపంచ యుద్ధ నేపధ్యంతో ముడిపడి ఉన్నాయి.
కారణాలు…
1914 18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది.
యుద్ధంకారణంగా పెంచబడిన భూమిశిస్తూ రైతాంగానికి భారమైంది.
ఆర్థిక మాధ్యం వలన పరిశ్రమలు మూత బడుతాయి.
కార్మికులలో అశాంతి చోటు చేసుకుంది.
రోజురోజుకు బలపడుతున్న విప్లవ వాదం నుండి కాపాడుకొనుటకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై జస్టిస్ రౌలత్ కమిటిని నియమించింది.
మానవ హక్కులను హరించే విధంగా రౌలత్ కమిటి నాలుగు చట్టాలను ప్రతిపాదించింది.
చట్టాలు దుర్వినియోగ పరచబడతాయని కాంగ్రెస్ నాయకత్వం ఆందోళనకు గురైంది.
ఏప్రిల్ 6, 1919 రౌలత్ చట్టం నిరసన దినంగా పాటించాలని గాంధీ పిలుపునిచ్చాడు.
పంజాబ్‌లో ఆందోళన వలన మిలటరీ ప్రభుత్వం జనరల్ డయ్యర్ నాయకత్వంలో అరాచకాలకు పాల్పడింది.
ఏప్రిల్ 13,1919 అమృత్‌సర్ పట్టణంలో జలియన్ వాలా బాగ్ సామూహిక హత్యాకాండ చోటు చేసుకుంది.
పంజాబ్ దురాగతాలకు బాద్యుడైన డయ్యర్‌ను శిక్షించాలని అనడం మరో కారణమైంది.
1919 మాంటేగ్ ఛెమ్స్ ఫోర్డ్ సంస్కరణలు స్వయం పరిపాలనకు బదులు ద్వంద ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం కాంగ్రెస్ నాయకత్వాన్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
దీంతో స్వయం పరిపాలన ఉద్యమం వైపు అడుగులు పడ్డాయి.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్యారిస్ శాంతి సమావేశంలో ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తామని ఆంగ్లేయులు ప్రకటించారు.
ఖలీఫా వ్యవస్థ పరిరక్షణకు సోదరులైన మౌలానా మహ్మద్ అలీ, షౌకత్ అలీలు అఖిల భారత ఖిలాఫత్ కమిటి స్థాపించారు.
ఢిల్లీలో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో గాంధీ ఖిలాఫత్ సంఘం అధ్యక్షునిగా ప్రకటించబడ్డాడు.
ఖిలాఫత్ పరిరక్షణ గాంధీ నైతిక బాద్యత అయింది.

ఉద్యమం తాను ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయింది.
కార్మిక, కర్షక సమస్యలు అపరిష్కృతంగానే మిగిలినాయి.
రౌలత్ చట్టాలు కొనసాగినాయి.
పంజాబు దురాగతాలకు బాద్యుడైన జనరల్ డయ్యర్ నిర్ధోషి అని హంటర్ కమిటి విచారణ సంఘం ప్రకటించింది.
స్వయం పరిపాలనకు బదులు ద్వంద ప్రభుత్వం కొనసాగింది.
ఏ ఖలీఫా పరిరక్షణకైతే ఉద్యమం ప్రారంభమైందో ఆ ఖలీఫా వ్యవస్థను టర్కీ ప్రజలే రద్దు చేసుకున్నారు.
ఆశించిన ఫలితాలు సాధించకపోగా ప్రతికూల ఫలితాలు చోటుచేసుకున్నాయి.
గాంధీ ఉద్యమాన్ని రద్దు చేయడంతో కాంగ్రెస్‌లో తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి.
దీంతో సి.ఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, విఠల్ బాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్వరాజ్ పార్టీ ఏర్పడింది.
గాంధీ ఉద్యమం నిలిపి వేయడంతో గాంధీకి ఆలీసోదరులకు మధ్య తీవ్ర అభిప్రాయ బేదాలు ఏర్పడ్డాయి.
ఉద్యమ వైఫల్యానికి ఆలీ సోదరులు గాంధీని తప్పు పట్టారు.
అప్పటి నుండి ముస్లింలు కాంగ్రెస్‌తో కలిసి జాతీయోద్యమంలో పాల్గొనలేదు.
ఉద్యమం తన ఆశయ సాధనలో విఫలమైనప్పటికీ కొన్ని చెప్పుకోతగిన విజయాలు సాధించింది.
ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్వహించకలిగిన విప్లవ పార్టీగా అవతరించింది.
కార్మికులు, కర్షకులు మొదటి సారిగా స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు.

ఉద్యమం పొకడలు

1920 నాగ్‌పూర్ కాంగ్రెస్ సమావేశం గాంధీని ఉద్యమానికి నాయకునిగా ప్రతిపాదించింది.
స్వదేశీ, స్వరాజ్, సంపూర్ణ బహిష్కరణ, పన్నుల నిరాకరణ ఉద్యమ ప్రణాళికలు గాంధీ ప్రకటించాడు.
మద్రాస్ ప్రెసిడెన్సీలో చీరాల పేరాల, పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమాలు నిర్వహించబడ్డాయి.
గిరిజన తెగలైన చెంచులు అడవి చట్టాలకు వ్యతిరేకంగా కనెగంటి హనుమంతు నాయకత్వంలో పల్నాడు అడవి సత్యాగ్రహం నిర్వహించారు.
గోదావరి ఏజన్సీ ప్రాంతంలో కోయలు అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో ఉద్యమించారు.
స్వదేశీలో భాగంగా ఖాదీ వస్త్రాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
దీంతో రాట్నం ఉద్యమంలో భాగమైంది.
సంపూర్ణ బహిష్కరణలో భాగంగా బ్రిటీష్ పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు కార్యాలయాలు బహిష్కరించబడ్డాయి.
ఉద్యమాన్ని బలహీన పరిచేందుకు ప్రభుత్వం వేల్స్ రాకుమారుడు భారతదేశ పర్యటనకు వస్తాడని ప్రకటించింది.
ఠాకూర్ సింగ్ ఆద్వర్యంలో సహాయ నిరాకరణ వ్యతిరేకోద్యమాన్ని ప్రారంభించింది.
ఉద్యమ గమనంలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఆలీసోదరులు పట్టు బడటం తో గాంధీకి ఆలీ సోదరుల మధ్య అభిప్రాయ బేదాలు తలెత్తాయి.
1921లో కేరళలోని మలబారు తీరంలోని మోప్లా అను ముస్లిం రైతు కూలీలు నంబూద్రి భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమించారు.
ఇది చివరికి హిందూ ముస్లిం మత కలహంగా మారింది.
మీరట్, లక్నో, ఖాన్‌ఫూర్‌లలో మతకాలహాలు చోటు చేసుకున్నాయి.
1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్ లోని ఘోరఖ్ పూర్ జిల్లాలో చౌరిచౌర సంఘటన చోటు చేసుకుంది.
ఉద్యమం హింసా యుతమై రక్షకభటులు సజీవ దహనం చేయడంతో ఫిబ్రవరి 11న గాంధీ ఉద్యమాన్ని నిలిపివేశారు.

హోమ్ రూల్ ఉద్యమం

దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షులైన మేడమ్ అనిబిసెంట్ మొట్టమొదటి సారిగా 1915 బాంబే సమావేశంలో హోమ్‌రూల్ ఉద్యమ ప్రతిపాదన చేసింది.
తొలి హోమ్‌రూల్ లీగ్‌ను తిలక్ బాంబే ప్రెసిడెన్సీలో స్థాపించాడు.
ఉద్యమానికి కారణాలు
1914లో ప్రారంభమైన తొలి ప్రపంచ యుద్దాన్ని ఒక అవకాశంగా చేసుకొని బ్రిటీష్ వారిపై ఒత్తిడి పెంచి కొన్ని రాజకీయ ప్రయోజనాలను పొందుటకు ఉద్యమం అవసరమని అనిబిసెంట్ భావించింది.
ఇంగ్లండ్ ఇతర వలసలైన కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో స్వయం పరిపాలన అమలులో ఉంది.
అటువంటిది భారతీయులకు స్వయం పరిపాలన ఇవ్వకపోవడం వివక్ష అవుతుందని అనిబిసెంట్ అభిప్రాయపడింది.
ఇంగ్లిష్ విద్యా విధానం భారతీయ సంస్కృతిని విలువలను దెబ్బతీసేదిగా పరిణమించింది.
ప్రత్యామ్నాయంగా స్వదేశీ విద్య ప్రాధాన్యతను చాటవలసిన అవసరాన్ని అనిబిసెంట్ గుర్తించింది.
ఉద్యమగమనం
మద్రాస్‌లో అనిబిసెంట్ తన హోమ్‌రూల్ లీగ్ స్థాపించింది.
న్యూ ఇండియా, కామన్‌వీల్ అనే పత్రికల ద్వారా హోమ్‌రూల్ భావాలను ప్రచారం చేసింది.
హిందూలాల్ యాగ్నిక్, జార్జి అరుండల్, బిపి వాడియాలు ఉద్యమానికి మద్దతు పలికారు.
ఉద్యమంలో భాగంగా జాతీయ కళాశాలలు పాఠశాలలు స్థాపించబడ్డాయి.
జాతీయ విద్యను భోదించుటకు అనిబిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాల స్థాపించింది.
జిల్లా స్థాయిలో గ్రంధాలయాలు పఠనాలయాలు స్థాపించబడ్డాయి.
స్వచ్ఛంద సామాజిక సేవసంస్థలు స్థాపించబడ్డాయి.
1917 గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫోర్డ్ ఆగస్టు ప్రకటనను అనుసరించి ప్రపంచ యుద్ధనంతరం భారతదేశానికి స్వయం పరిపాలన ఇవ్వబడుతుందని ప్రకటించబడింది.
దీనిని విశ్వశిస్తూ అనిబిసెంట్ ఉద్యమాన్ని నిలిపి వేసింది.
ఉద్యమ ఫలితాలు
కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకమైన నాయకత్వం లేని సమయంలో ఉద్యమం నాయకత్వాన్ని అందించింది.
స్వదేశీ విద్య, సామాజిక సేవ ప్రాధాన్యతను ఉద్యమం తెలియజెప్పింది.
మోతీలాల్ నెహ్రూ, మహ్మద్ ఆలీజిన్నా వంటి నూతన నాయకత్వాన్ని ఉద్యమం అందించింది.
స్వాతంత్య్రోద్యమంలోకి అప్పటి వరకు ప్రవేశించని సింధీలు తొలిసారిగా ఉద్యమం లోకి ప్రవేశించారు.
ఉద్యమం ద్వారా స్త్రీలు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనడం మరింత పెరిగింది.
1917 కలకత్తా ఐఎన్‌సీ సమావేశానికి మేడం అనిబిసెంట్ అధ్యక్షత వహించింది.
ఐఎన్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంట్..
l ఉద్యమం వలన స్వయం పరిపాలనా దిశగా సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి.
1919 మాంటేగు చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలతో ద్వంద ప్రభుత్వం ఏర్పరచబడి 6 శాఖలు భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి.
ఉద్యమం భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని విదేశాలలో కూడా చాటి చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News