Monday, April 29, 2024

జయలలిత మృతిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన జస్టిస్ ఎ ఆరుముగస్వామి కమిషన్

- Advertisement -
- Advertisement -

 

Jayalalita

చెన్నై:  దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత మరణానికి సంబంధించిన పరిస్థితులపై విచారణ జరిపిన కమిటీ తన  నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి శనివారం సమర్పించగా, ఆగస్టు 29న జరిగే రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో దీనిని చేపట్టనున్నారు. 150 మందికి పైగా సాక్షులను విచారించినప్పుడు విచారణకు నాయకత్వం వహించిన జస్టిస్ ఎ ఆరుముఘస్వామి, నివేదికను ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌కు సమర్పించారు.  ఇప్పుడు దానిని బహిరంగపరచడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఈ నివేదికను సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రంలో ఏప్రిల్ 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార డిఎంకె, జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులపై సరైన విచారణ జరిపి, ‘ఎవరైనా’ దోషిగా తేలితే మళ్లీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. గత ఎఐఎడిఎంకె ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరుముఘస్వామి కమిషన్ విచారణ నవంబర్ 22, 2017న ప్రారంభమైంది. దాని ప్యానెల్ హెడ్ మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి. ఆయన విలేకరులతో మాట్లాడినప్పుడు: ‘‘ “ప్రభుత్వం మాత్రమే నివేదికను ప్రచురించడంపై నిర్ణయం తీసుకోగలదు”  అన్నారు, అన్ని సంబంధిత అంశాలను నివేదికలో ప్రస్తావించారు, నివేదిక సమర్పించడం తనకు సంతృప్తికరంగా ఉందన్నారు.

జయలలిత 75 రోజుల ఆసుపత్రి గడిపాక అదే సంవత్సరం డిసెంబర్ 5 న మరణించింది. “ఎవరిపైనైనా సందేహాలు ఉన్నాయా?” అని అడిగితే, “అదే నివేదిక” అని న్యాయమూర్తి బదులిచ్చారు, పదేపదే ప్రశ్నించినప్పటికీ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు.  కమిషన్ ముందు వాంగ్మూలం ఇచ్చిన సాక్షుల్లో ఎఐడిఎంకె  అగ్రనేత ఓ పన్నీర్‌సెల్వం, జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, వైద్యులు, ఉన్నతాధికారులు, ఆ పార్టీకి చెందిన సి విజయభాస్కర్ (మాజీ ఆరోగ్య మంత్రి), ఎం. తంబి దురై, సి. పొన్నయన్, మనోజ్ పాండియన్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News