Sunday, May 5, 2024

రెండేళ్లలో పసిడి 27% పెరగొచ్చు

- Advertisement -
- Advertisement -

ముంబై : గత వారం బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) వెబ్‌సైట్ ప్రకారం, ఆగస్టు 21న బులియన్ మార్కెట్‌లో బంగారం రూ.58,345గా ఉంది, ఇప్పుడు ఆగస్టు 26న 10 గ్రాములు రూ.58,720కి చేరుకుంది. అంటే గత వారం దీని ధర రూ.425 పెరిగింది. క్యారెట్ ద్వారా బంగారం ధరలు చూస్తే, 24 క్యారెట్ ధర రూ.58,720గా ఉండగా, 22 క్యారెట్ ధర రూ.53,788కు, 18 క్యారెట్ ధర రూ.44,040కు చేరింది. ఐబిజెఎ వెబ్‌సైట్ ప్రకారం, గత వారం వెండి రూ.3 వేలకు పైగా పెరుగుదలను చూసింది. ఈ వారం ప్రారంభంలో రూ.70,484 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.73,695కి చేరింది. అంటే ఈ వారం దీని ధర రూ.3,211 పెరిగింది.

రెండేళ్లలో పసిడి 27% పెరగొచ్చు
కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా ప్రకారం, కొద్ది నెలల స్వల్ప ఉపశమనం తర్వాత ద్రవ్యోల్బణం మరోసారి పెరగడం ప్రారంభించింది. దీన్ని తగ్గించేందుకు అమెరికా, యూరప్‌లలో వడ్డీరేట్లను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో స్టాక్‌మార్కెట్ సరికొత్త శిఖరాలకు చేరుకుని లాభాల స్వీకరణ కారణంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఈ రంగం సిద్ధమవుతోంది. పసిడి రెండేళ్లలో 27 శాతానికి పైగా రాబడిని ఇచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. బంగారం ప్రస్తుతం ఫ్యూచర్స్‌లో రూ.60,000 లోపు ఉండగా, బులియన్ మార్కెట్‌లో రూ.59,500 దిగువన ఉంది. ఈ సంవత్సరం 65,000, జూన్ 2025 నాటికి 10 గ్రాములకు రూ. 75,000 చేరుకోవచ్చు. దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారం డిమాండ్ ఉంది. దీనిలో 1 టన్ను మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి చేయగా, మిగిలినది దిగుమతి అవుతోంది. బంగారం వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News