Sunday, April 28, 2024

విద్యకు ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులతో ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో విద్యావ్యవస్థను పట్టించుకునే నాథుడు లేడని, నేడు సాధించుకున్న తెలంగాణలో విద్యా వ్యవస్థ పనితీరు అద్బుతంగా ఉందన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గురుకులాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వం విద్యా సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి ఎల్లపుడు కృషి చేస్తానని అన్నారు. ఒకప్పుడు తాండూరు నుంచి వలస వెళ్లేవారని నేడు కర్ణాటక నుంచిపర్సన్ స్వప్న పరిమల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, ఆర్‌డిఓ అశోక్‌కుమార్, కౌన్సిలర్లు విజయదేవి, శోభరాణి, సంగీతా ఠాగూర్, నాయకులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News