- Advertisement -
ప్రజలు సుఖ, శాంతులతో వర్థిల్లాలి
రాజ్భవన్లో పూజలు నిర్వహించిన గవర్నర్
మనతెలంగాణ/హైదరాబాద్: విజయదశమి సందర్భంగా రాజ్భవన్లో జరిగిన ఆయుధపూజలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొని పూజలు నిర్వహించారు. సెక్యూర్టీ సిబ్బంది ఆయుధాలు, వాహనాలకు గవర్నర్ పూజలు చేశారు. సంప్ర దాయంగా జరిగే ఈ పూజల్లో రాజ్భవన్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లోని దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహించారు. ప్రజలు సుఖ, శాంతులతో వర్థిల్లాలని, సుఖంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్టు గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కుటుంబ సభ్యులు, కార్యదర్శి సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Governor Tamilisai Perform Ayudha Puja at Raj Bhavan
- Advertisement -