Friday, May 3, 2024

రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ శనివారం స్పందించారు. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ గానే ఉంటున్నానని తమిళిసై స్పష్టం చేశారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగిస్తే అది ఫాలో అవుతానన్నారు. ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని చెప్పిన గవర్నర్ ప్రధాని మోడీ, రాముడి దయతో విధులు నిర్వహిస్తున్నానని వెల్లడించారు. ఎంపిగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదన్నారు. ఢిల్లీ వెళ్లలేదన్న ఆమె ఎవరినీ రిక్వెస్ట్ కూడా చేయలేదని పేర్కొన్నారు. వరదల ప్రభావం వల్ల తూత్తుకుడి వెళ్లి వచ్చానని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గవర్నర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News