Sunday, April 28, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ప్రభుత్వం తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పొడిగించినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఒక ఉత్తర్వులో తెలియజేసింది. అంతకు ముందు ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను ఈ నెల 31 వరకు నిషేధించింది. ‘ఈ నెల 31 వరక ఉల్లిపాయల ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని తిరిగి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పాడిగించడమైంది’ అని విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్ (డిజిఎఫ్‌టి) శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వులో తెలిపింది. ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుండే మంత్రిత్వశాఖలోని ఒక విభాగం డిజిఎఫ్‌టి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News