Friday, April 26, 2024

బీహార్‌లో ముగ్గురు ప్రభుత్వ అధికారులపై విజిలెన్స్ దాడులు…

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లోని ముగ్గురు ప్రభుత్వ అధికారులపై విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి రూ.4కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కిషన్ గంజ్ డివిజన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సంజయ్ కుమార్ రాయ్, ఆయన సబార్డినేట్ ఉద్యోగులకు చెందిన ఇళ్లు, ఇతర చోట్ల ఈ సోదాలు జరిగాయి. కిషన్ గంజ్‌లోని రాయ్ ఇంటికి విజిలెన్స్ అధికారులు వచ్చినప్పుడు రాయ్ తనకు వచ్చిన లంచాల సొమ్మంతా జూనియర్ ఇంజినీర్, కేషియర్ ఇళ్లల్లోనే దాచినట్టు బయటపడింది. కేషియర్ ఇంటి నుంచి రూ.3కోట్ల నగదును, అదే సమయంలో పాట్నాలోని రాయ్ ఇంటివద్ద రూ.కోటికి పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Govt Officers Vigilance Raid in Bihar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News