Wednesday, May 15, 2024

ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

మౌలాలి : వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి బిజెపి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని స్ధానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మీ హర్షం వ్యక్తం చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా బుధవారం ఆమె వాజ్‌పేయ్‌నగర్ బూత్ నెంబర్ 134లో నిర్వహించిన ‘ఇంటింటికి బిజెపి’ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను కలిసి వారు ఎదుర్కొంటున్న స్ధానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమకు చెబితే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాల పాలనలో కేంద్ర ప్రభుత్వం హయంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు జరుగుతున్న వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆమె కర పత్రాలను పంపిణి చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రలు ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. మరో మారు బిజెపి ప్రభుత్వం వస్తుందని, అదే విధంగా రాష్ట్రంలో కూడా వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కె. భానుప్రకాశ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొమ్మాటి సంతోష్‌కుమార్, శక్తి కేంద్రం ఇన్‌ఛార్జి తిరుమల దేవి, వినాయక్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాశ్, బూత్ కమిటి ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మీ, సీనియర్ నాయకులు గడప నర్సింగ్‌రావు, పంజా శ్రీనివాస్, జెనిగ వెంకటేష్, అంజన, లత, సుశీల అధ్యక్షుడు ఓం ప్రకాశ్, నాయకులు ఉడుత నవీన్, నీలం శ్రీనివాస్, కవిత, శక్తి కేంద్రం ఇన్‌చారి గడప నర్సింగ్‌రావు, బూత్ అధ్యక్షుడు జగధీష్, శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News