Thursday, May 2, 2024

పర్యావరణ పరిరక్షణ మనబాధ్యత

- Advertisement -
- Advertisement -

మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

 

మనతెలంగాణ/హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలా ముందుకు సాగుతుంది.  ప్రముఖులు,సెలబ్రిటీలు గ్రీన్ ఇండియా ఛాఆలెంజ్‌లో పాల్గొని సవాళ్లు విసురుకుంటున్నారు. హీరో నిఖిల్ ఇచ్చిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి సుప్రసిద్ధ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురువారం మొక్కలు నాటారు. బాచుపల్లీలో మొక్కలు నాటిన హీరోయిన్ అనుపమ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ మొదలు పెట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం పెంచుతుందన్నారు. అలాగే సోషల్‌మీడియా వేదికగా గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ మరో ముగ్గురికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మమత ఆసుపత్రి ఎండి పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. పుట్టిన రోజుసందర్భంగా పెద్దంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ పి.బలరాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యతగా మనమందరం మొక్కలు నాటి వాటిని రక్షించాలని విజ్ఞప్తి చేశారు. తన మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నరసింహారెడ్డి, శైలజ, సురేష్ కుమార్, అశోక్ కుమార్,హనుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News