- Advertisement -
హైదరాబాద్: గణేశ్ నిమజ్జనంలో ఓ ఆర్మీ మాజీ జవాన్ కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని నార్సింగి హైదర్షాకోట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… హైదర్షాకోట్లోని శివం హైలెట్స్ అపార్ట్మెంట్లో ఆర్మీ మాజీ జవాన్ నాగ మల్లేష్ నివాసముంటున్నాడు. వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ఇంటి సమీపంలో ఉన్న హైరిచ్ ఇంటర్నెట్ సిబ్బంది పార్టీ చేసుకున్నారు. గతంలో ఇంటర్నెట్ సిబ్బందిని జవాన్ మల్లేష్ పలుమార్లు హెచ్చరించిన పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన జవాన్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మాజీ జవాన్ ను అరెస్ట్ చేసి, అతని దగ్గరినుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
gun firing in ganesh nimajjanam at narsingi
- Advertisement -