Tuesday, April 30, 2024

ప్ర‌జా తీర్పుకు శిర‌సావ‌హిస్తా: హరీష్ రావు

- Advertisement -
Harish rao accept defeat in huzurabad by elections
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌జాతీర్పును శిర‌సావ‌హిస్తానని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరున కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు ధన్య‌వాదాలు తెలిపారు.  ఏది ఏమైనా టిఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు, గెలిచిన‌నాడు పొంగిపోలేదన్నారు. ఓడినా.. గెలిచిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందన్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News