Friday, May 3, 2024

సిద్ధిపేట చింతల్ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రులు..

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఆదివారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏడవ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.

మత్స్య పారిశ్రామిక సంఘం పరిధిలోని సిద్ధిపేట చింతల్ చెరువులో మంత్రులిద్దరూ కలిసి 52 వేల చేప పిల్లలు వదిలారు. మంత్రుల వెంట ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News