Friday, April 26, 2024

బావి దగ్గర మీటర్లు పెడ్తలేమని 12 వేల కోట్లు కేంద్రం ఇవ్వడం లేదు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: రైతు శ్రేయోభిలాషి రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కెసిఆర్ అని, రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగొద్దని ఈ నెల 28వ తేదీ నుంచి సంక్రాంతి పండుగలోపు ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రైతుబంధు అందించాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఒక్క గుంట ఎండకుండా ఇవాళ పచ్చగా పంట వెనుక పంటలు పండుతున్నాయంటే.. అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వచ్చిన గోదావరి నీళ్ల వల్లనేనని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ యార్డులో గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హాజరయ్యారు. మంత్రి సమక్షంలో ఆత్మకమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మంత్రి మాట్లాడారు. బావి దగ్గర మీటర్లు పెడ్తలేమని 12 వేల కోట్లు కేంద్రం ఆపిందని చురకలంటించారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం దాదాపు 40 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చే డబ్బును ఆపేయడంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని మంత్రి విమర్శించారు. గతంలో యాసంగి పంట అంటే గాలిలో దీపం ఇప్పుడు సంవత్సరానికి గజ్వేల్ రైతులు రెండు పంటలు పండించే పరిస్థితి ఏర్పడిందని సంతోషం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకపోతే ఏళ్ల తరబడి ఏనాడు మత్తడి దూకని ఈ కూడేల్లి వాగు ఇవాళ మత్తడి దూకుతున్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News