Thursday, May 2, 2024

శ్రియా భర్తకు కరోనా

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్‌తో ప్రపంచమంతా గడగడ వణికిపోతుంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్, యుకెలో మృత్యువు విలయతాండవం చేస్తోంది. ఈ నాలుగు దేశాల్లో 90 వేల మంది ఇప్పటి వరకు మృతి చెందారు. హీరోయిన్ శ్రియ భర్త ఆండ్రూ కొచీవ్ కరోనా వైరస్ సోకిందని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా పొడి దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారని శ్రియా తెలిపింది. దీంతో అతడు సెల్ప్ క్వారంటైన్‌లో ఉంటున్నాడు.  ప్రస్తుతం కరోనా పాజిటీవ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. ప్రస్తుతం శ్రియా తన భర్తతో కలిసి స్పెయిన్‌లో ఉంటుంది. స్పెయిన్‌లో కరోనా రోగుల సంఖ్య 1,72,541 చేరుకోగా 18 వేల మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 19,34,557 మందికి సోకగా 1,20,438 మంది మరణించారు.

 

Heroine Shriya Husband Corona positive in Spain
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News