Sunday, April 28, 2024

భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ నౌక హైజాక్ …. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇజ్రాయెల్‌కు చెందిన నౌక తుర్కియే నుంచి భారత్‌కు వస్తుండగా హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. ఈ వీడియోను హౌతీ రెబెల్స్ విడుదల చేశారు. సాయుధులు హెలికాప్టర్‌లో నౌకలోని డెక్‌పై దిగారు. అనంతరం స్లోగన్స్ చేస్తూ గాల్లోకి కాల్పులు జరిపారు. ఒక్కొక్కరు ఓడ లోపలికి వెళ్లి సిబ్బందిని బెదిరించారు. అనంతరం ఓడను తమ అదుపులోకి తీసుకొని యెమెన్‌కు తరలించారు. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్ నౌకను హైజాక్ చేశారు. సదరు నౌకలో తమ దేశపు పౌరులు లేరని ఇజ్రాయెల్ ప్రకటించింది. సదరు నౌక ఇజ్రాయెల్ చెందిన వ్యాపారిది కానీ ఆ నౌకను జపాన్‌కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని అధికారులు వెల్లడించారు. ఆ నౌకలో ఉక్రెయిన్, మెక్సికో, ఫిలిప్పీన్స్, బల్గేరియాకు చెందిన 25 మంది ఉన్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News