- Advertisement -
కర్నూలు: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కార్తిక సోమవారం సందర్భంగా మలన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. పాతాళగంగలో తెల్లవారుజాము నుంచే భక్తుల పుణ్యస్నానాలు చేసి గంగాధర మండపం, ఆలయ ఉత్త మాడ వీధిలో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. స్వామివారి అలంకార దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. భక్తుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Huge devotees visit Srisailam Temple
- Advertisement -