Sunday, April 28, 2024

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం వీకెండ్ కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంటున్నారు. స్వామివారి సర్వదర్శం కోసం భారీగా భక్తులు రావడంతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, గురువారం శ్రీవారిని 69,483 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమలలో నిన్న 32,459 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: తిరుమల గోగర్భం డ్యామ్‌లో దూకబోయిన భక్తుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News