Saturday, April 27, 2024

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, ఆదివారం శ్రీవారిని 88,836 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.. తిరుమలలో నిన్న 35,231 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.69 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News