Tuesday, May 7, 2024

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తుండడంతో క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, గురువారం శ్రీవారిని 63,628 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 33,548 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.26 కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News