Sunday, April 28, 2024

శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లు

- Advertisement -
- Advertisement -

Huge Devotees visited Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం తిరుమల శ్రీవారిని 67,577మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 29,165మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు అర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. ఇవాళ స్వామివారి సర్వదర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి అధికారులు సూచించారు.

Huge Devotees Visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News