Tuesday, April 30, 2024

తిరుమల ఆలయ సమాచారం..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 79,836మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న 35,916 మంది భక్తులు శ్రీవారికి తమ తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు 24 కంపార్ట్ మెట్లలో వేచి ఉన్నారు. భక్తులకు సర్వదర్శనానికి సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతుండగా, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.56కోట్ల ఆదాయం కానుకల రూపంలో వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు. రేపు అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News