Sunday, May 5, 2024

శృతికి భారీ రెమ్యునరేషన్

- Advertisement -
- Advertisement -

Huge remuneration for Shruti hassan

దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలుగొందిన శృతి హాసన్ ‘కాటమరాయుడు’ తర్వాత తెలుగు సినిమా చేయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం తీసుకుంది. ఆతర్వాత ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఇదే క్రమంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో మళ్ళీ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన శృతి.. పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్’లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో అమ్మడు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంటుందని భావిస్తుండగా.. ఇటీవలే సీనియర్ హీరో బాలకృష్ణ సరసన నటిస్తున్నట్లు ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ,- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఇందులో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే హీరోహీరోయిన్ల మీద క్లాప్ కొట్టి లాంఛనంగా సినిమాని ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో నటించడానికి శృతిహాసన్‌కు మేకర్స్ దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా చెల్లిస్తున్నారట. ఇప్పటి వరకూ శృతి నటించిన తెలుగు సినిమాల్లోకెల్లా ఇదే అత్యధిక పారితోషిక చిత్రమని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. దీనికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో శృతి హసన్‌తో పాటుగా మరో హీరోయిన్ కూడా భాగం కానుందని టాక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News