Friday, May 3, 2024

ఇంట్లో నవవధువు ఆత్మహత్య… భర్త జైల్లో ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Constable commits suicide in Ranga Reddy district

బెంగళూరు: వరకట్న వేధింపుల తాళలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త జైళ్లో ఉరేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరామ్ పూర్‌లోని ఎస్‌బిఎం కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్‌ను ఆశారాణి ఏప్రిల్ 4న వివాహం చేసుకుంది. మే 3వ తేదీన నవ వధువు ఉరేసుకుంది. దీంతో ఆమె తల్లిదండ్రులు తమ కూతురు వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే ప్రదీప్ అరెస్టు చేసి జైలుకు తరలించారు. తాత్కాలిక గదిలో ఉంచడంతో అక్కడ ఉన్న బెడ్ షీట్ సహాయంతో ప్రదీప్ ఉరేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News