- Advertisement -
హైదరాబాద్: నగరంలోని మియాపూర్ (Hyderabad Miyapur) పరిధిలోని హఫీజ్పేటలో ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. భవన నిర్మాణ కర్రల వ్యాపారం చేస్తున్న శ్రీనివాస్ (36)పై పక్క షాపుకు చెందిన సోహైల్, అతడి మామ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే శ్రీనివాస్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గ మధ్యంలోనే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -