Sunday, April 28, 2024

ఆఖరి మ్యాచ్ చెన్నైలోనే: ధోని

- Advertisement -
- Advertisement -

I'll play last IPL Match in Chennai: MS Dhoni

చెన్నై: వచ్చే ఐపిఎల్‌లో ఆడాలా వద్దా అన్నది ఇంకా ఆలోచించలేదని, దానికి ఇంకా చాలా సమయం ఉందని చెన్నై సూపర్ కింగ్స్(సిఎస్‌కె) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. అయితే, తన ఐపిఎల్ కెరీర్‌లో చివరి మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడతానని తేల్చి చెప్పాడు. ఇక ఐపిఎల్‌లో వచ్చే ఏడాది ఆడాలా వద్ద అనే దానిపై ఇప్పట్లో ఏమీ చెప్పలేనన్నాడు. మరో ఐదేళ్ల పాటు తాను ఐపిఎల్‌లో కొనసాగినా ఆశ్చర్యం లేదన్నాడు. ఫిట్‌నెస్ సహకరించినంత కాలం తాను ఐపిఎల్‌లో కొనసాగుతానని పేర్కొన్నాడు. కాగా, శనివారం చెన్నైలో సిఎస్‌కె ఐపిఎల్ 2021 టైటిల్ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధోనితో పాటు తమిళనాడు సిఎం స్టాలిన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్, బిసిసిఐ కార్యదర్శి జైషా తదితరులు పాల్గొన్నారు. ఇక వచ్చే ఐపిఎల్ భారత్‌లోనే జరుగుతుందని జైషా స్పష్టం చేశారు. ఈసారి టోర్నీని స్వదేశంలోనే నిర్వహిస్తామన్నారు. దీనిపై ఇంకా ఆలోచన లేదన్నారు.

I’ll play last IPL Match in Chennai: MS Dhoni

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News