Sunday, April 28, 2024

పెళ్లికి నో… ప్రియుడిపై వివాహిత యాసిడ్ దాడి….

- Advertisement -
- Advertisement -

Woman injured after Acid Attack in Medak

తిరువనంతపురం: ప్రియుడిపై వివాహిత యాసిడ్ దాడి చేసిన సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరుణ్ కుమార్ అనే యువకుడికి షీబా అనే మహిళ సోషల్ మీడియాలో పరిచయమైంది. ఇద్దరు పలుమార్లు బయట కలుసుకోవడంతో వివాహేతరం సంబంధానికి దారితీసింది. షీబాకు గతంలో పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలియడంతో ఆమెను అరుణ్ దూరంపెట్టాడు. ఆమెకు భర్తకు మనస్పర్థలు రావడంతో ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. షీబా అంగీకరించకపోవడంతో వివాహం చేసుకోవాలని పట్టుబడడంతో నలుగురికి చెప్తానని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో అరుణ్ ఆమెకు డబ్బులు ఇచ్చి బంధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు. తిరువనంతపురంలో తన స్నేహితుడుతో కలిసి అరుణ్ కుమార్ చర్చికి వెళ్లాడు. అక్కడి షీబా అడిగిన మొత్తాన్ని ఇచ్చాడు. కానీ ఇద్దరు మధ్య వివాహం విషయంలో మళ్లీ గొడవ జరిగింది. యాసిడ్ బాటిల్ తీసుకొని అరుణ్ కుమార్ ముఖంపై పోసింది. ఈ క్రమంలో యాసిడ్ ఆమెపై కూడా పడింది. తీవ్రంగా గాయపడిన అరుణ్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడికి కంటి చూపు పోయినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News