Sunday, April 28, 2024

రోహిత్ సెంచరీ.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 270/3

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 14 ఫోర్లు, సిక్స్‌తో 127 పరుగులు చేశాడు. మరోవైపు పుజారా కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించాడు. పుజారా 9 బౌండరీలతో 61 పరుగులు చేశాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. తర్వాత వీరిద్దరినీ ఓకే ఓవర్ లో కాబిన్సన్ ఔట్ చేసి టీమిండియాకు షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, జడేజా()లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. దీంతో శనివారం మూడో రోజు ఆట మగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. దీంతో భారత్, ఇంగ్లండ్ జట్టుపై 171 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది.

IND vs ENG 4th Test: India 270/3 at Stumps on day 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News