Saturday, May 4, 2024

చెలరేగుతున్న సఫారి బౌలర్లు.. ఆచితూచి ఆడుతున్న భారత్

- Advertisement -
- Advertisement -

సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్‌ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్వల్ప వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ(10) స్వల్ప వ్యవధిలోనే ఔటై నిరాశపర్చాడు. దీంతో భారత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ సాయి సుదర్శన్(37), కెప్టెన్ కెఎల్ రాహుల్(2)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News