Sunday, April 28, 2024

టీమిండియాతో తొలి వన్డే: ఆరో వికెట్ కోల్పోయి శ్రీలంక‌

- Advertisement -
- Advertisement -

IND vs SL: SL has gone 6th Wicket at 186

కొలంబో: టీమిండియాతో జరుగుతున్న తొలి వ‌న్డేలో ఆతిథ్య శ్రీలంక జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు 49 పరుగులకే తొలి వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతున్న లంక బ్యాట్స్ మెన్లను స్పిన్న‌ర్లు కుల్‌దీప్ యాద‌వ్, చాహ‌ల్‌, కృనాల్ లు దెబ్బకొట్టారు. దీంతో అవిష్క ఫెర్నాండో(32), మినోద్ భ‌నుక(27), భ‌నుక రాజ‌ప‌క్స(24), ధ‌నుంజ‌య డిసిల్వా (14), సహరంగా(8) దీంతో లంక 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షనక(29), కరుణరత్నె(0)లు ఉన్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్‌దీప్ యాద‌వ్ లు రెండేసి వికెట్లు పడగొట్టగా.. చాహ‌ల్‌, కృనాల్ లు తలో వికెట్ తీశారు.

IND vs SL: SL has gone 6th Wicket at 186

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News